Friday, June 29, 2007

మీరు ఎప్పుడైనా సింగినాదం జీలకర్ర అనే సామెత విన్నారా? దీనివెనుక చిన్నకధ వుందండీ

సింగినాదం జీలకర్ర అనే సామెత సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని గురించి బాగా గొప్పగా చెప్పి, అక్కడ ఆ విషయం అనుకున్నంత గొప్పగా లేకపోతే ఆ విషయం గురించి విన్నవారు ఆ ఏముంది సింగినాదం జీలకర్ర అనడం పరిపాటి అయిపోయింది.అయితే ఈ సింగినాదం జీలకర్ర అనేది దాని అసలు రూపం అది కాదండీ. శృంగనాదం జీలకర్ర నుండి వచ్చినదే ఈ సింగినాదం జీలకర్ర. దీని వెనుక వున్న అసలు విషయం ఏమిటంటే. పూర్వకాలం బందిపోటు దొంగలు గ్రామాలపై బడి విచ్చలవిడిగా దోపిడీలు, దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ఇలా గ్రామాలపై దాడికి వచ్చినపుడు శృంగమనే వాయిద్యాన్ని ఊదుకుంటూ వచ్చే వారు. దాంతో శృంగమనే వాయిద్యం శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయేవారు. అలాంటి పరిస్థితులలో ఒకానొకరోజు కొంతమంది జీలకర్ర వ్యాపారస్తులు జీలకర్ర అమ్మడానికి గ్రామానికి వచ్చారంట. ఇప్పటికీ మన గ్రామాలలొ ఏదైనా విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాలంటే చాటింపు ద్వారా తెలియ చేస్తారు. అలాగే జీలకర్ర వ్యాపారస్తులు కూడా జీలకర్ర అమ్ముతామంటూ ఈ శృంగము ఊదుతూ తిరిగారంటా.ఈ శృంగము యొక్క శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయారంట. కాని ఎంతసేపటికీ ఎటువంటి అలజడి లేకపోవడంతో జనమంతా మెల్లగా బయటికి వచ్చి చూస్తే జీలకర్ర వర్తకులు. అరే శృంగనాదం బందిపోటు దొంగలది కాదు జీలకర్ర వర్తకులది. మనం అనవసరంగా భయపడ్డాం అని ఊపిరి పీల్చుకున్నారంట. అప్పటినుండి లేనివిషయానికి అనవసరంగా రాద్దంతం చేస్తే ఏముంది శృంగనాదం జీలకర్ర అనడం పరిపాటి అయ్యింది. అదే రానురానూ సింగినాదం జీలకర్ర అయ్యింది.

Friday, June 22, 2007

రాత్రి పూట చెట్లక్రింద పడుకొంటే దెయ్యాలు పీక నులిమి లేదా గుండెలపై కూర్చుని చంపేస్తాయి.

రాత్రి పూట చెట్లక్రింద పడుకొంటే దెయ్యాలు పీక నులిమి లేదా గుండెలపై కూర్చుని చంపేస్తాయి. కాబట్టి చెట్ల కింద పడుకోవద్దంటారు. ఇది ఎంతవరకూ నిజం. ఎందుకలా అన్నారు? మీరైతే ఏం చెబుతారు?
అటువంటిది ఏమీలేదు. రాత్రి వేళలలో చెట్లు నిష్కాంతి చర్య చేస్తాయి.నిష్కాంతి చర్య అంటే సూర్యుని కాంతి లేకుండా చేసే చర్య అని అర్ధం. కాంతి చర్యలో చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుంటాయి. ఆ ఆక్సిజన్ మనిషికి జీవనాధారమని అందరికీ తెలుసు. అలాగే నిష్కాంతి చర్యలో చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటాయి. అందుకే రాత్రి వేళలలో చెట్ల కింద పడుకొంటే చెట్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ పీల్చవలసి ఉంటుంది. అపుడు మనిషి బతకడానికి సరిపడా ఆక్సిజన్ అందకపోతే గొంతు నులుమినట్లు,గుండెలపై పెద్ద బరువు పెత్తినట్లు అనిపిస్తుందంతే. మరల ఆక్సిజన్ సరిగా అందితే మామూలుగానే వుంటుంది.

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?

పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు మన పెద్దలు. ఎందుకో తెలుసా?
ఎందుకంటే శృంగార పరంగా చూస్తే, పురుషులలొ కన్నా స్త్రీలలో శృంగార వాంచలు కొంచం ముందుగానే తగ్గిపోతాయి. ఉదాహరణకి ఒక పురుషుడు 60 సంవత్సరముల వరకూ శృంగార వాంచలు కలిగి ఉంటే స్త్రీ 55 సంవత్సరముల వరకూ మాత్రమే శృంగార వాంచలు కలిగి ఉంటారు. ఎందుకంటే వీరిలో పురుళ్ళు, బహిస్టు వంటి ప్రకృతి కార్యక్రమముల వలన వీరి శరీరం, ఎముకలు త్వరగా బలహీనము అవుటాయి. అందుకే పురుషులలొ కన్నా స్త్రీలలో మెనొపాజ్ స్టేజ్ త్వరగా వస్తుంది. పైన చెప్పిన వయస్సులు కేవలం ఉదాహరణకి తీసుకున్నవి మాత్రమే. మనిషిని బట్టీ, వారి వారి ఆరోగ్య విధానాన్ని బట్టి ఈ వయసు ఆధార పడి ఉంటుంది. అందుకే స్త్రీ పురుషుల మధ్య శృంగార సమన్వయం లో పించకుండా పెళ్ళి చేసుకొనేటప్పుడు అమ్మాయి వయసు అబ్బాయి వయసు కన్నా తక్కువ ఉండాలంటారు. నా వివరణ తప్పయితే క్షమించి సరయిన కారణమును తెలియ చేయగలరు.

Thursday, June 21, 2007

స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్‌) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.

స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్‌) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.గృహకృత్యాలలొ పాల్గొనేవారు కాదు,విశ్రాంతి తీసుకొనేవారు.దీని వెనుక గల శాస్త్రీయ కారణము యేమై వుండవచ్చు? జాబాలిముని
అని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన మరియు స్త్రీల సమస్య. ఇలాంటి వాటిపై వివరణ స్త్రీలు లేదా డాక్టర్స్ అయితే సరిగా ఇవ్వగలరు. నా ఆలోచనా పరిధిలో ఈ బహిస్టు సమయములో స్త్రీలలో ఎక్కువగ రక్త స్రావం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో వారు చాలా నీరసంగా వుంటారు. అలాంటి పరిస్థితులలో ఇంటిపని, వంటపని అంటూ పనులన్నీ చేస్తుంటే వారు ఇంకా నీరసించి పోతారు. ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం. అలాగే రక్తస్రావం వలన బ్యాక్టీరియా ఇంఫెక్షన్ వచ్చే అవకాసం వుంది. కనుకనే బహిస్టు సమయము మూడు రోజులూ అన్ని రకములైన పనులకూ దూరంగా వుండమంటారు. ఆ సమయంలొ బలవర్ధకమైన ఆహారం మరియు పళ్ళరసాలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పనులు మీరు సక్రమంగా చేసుకొవచ్చు. నా అభిప్రాయం తప్పయితే మన్నించగలరు. సహ్రుదయంతో మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారని ఆశిస్తూ...

Wednesday, June 20, 2007

పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు. ఎందుకు?

ఎందుకంటే పెళ్ళిళ్ళు, శుభకార్యములు జరిగినపుడు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది మనుషులు ఒక చోట చేరుతారు.మనుషులు అందరూ గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటారు. కాబట్టి శుభకార్యములు జరిగినప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అటువంటప్పుడు గాలిలొ ఆక్సిజన్ పెంచడానికి మామిడి తోరణాలు, తాటాకు పందిళ్ళు, అరటి చెట్లతో మండపాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ఆకుపచ్చని మొక్కలు అన్ని గాలిలొ ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంటాయి. అందుకని పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు.

మన సాంప్రదాయాలు వాటి వెనుక వున్న సైంటిఫిక్ కారణాలు గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా?

మన నిత్య జీవితంలొ ఎన్నో పనులు మన పెద్దలు చెప్పారనే ఒకే ఒక కారణంతో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటాము. అయితే ప్రతీ పని వెనుకా ఒక సైంటిఫిక్ కారణం దాగుంటుంది. ఆ కారణాలు బయటకు తీసే ప్రయత్నంలొ మీరు పాలు కాదు కాదు అభిప్రాయాలు పంచుకోండి.

Sunday, June 17, 2007

**** తెలుగు జాతీయులందరూ గర్వించదగ్గ గీతం **** ఈ మా తెలుగు తల్లికి


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగలారతులు
కడుపులొ బంగారు, కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొర్లుతాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ ఆటలే అడుతాం, నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లి!, జై తెలుగు తల్లి!

http://groups.google.com/group/telugusnehithulu

Saturday, June 16, 2007

తెలుగుస్నేహితులు

తెలుగు మాట్లాడే వారందరికీ ఒక విన్నపం. భాషించునది భాష అని అర్ధం. తేనెలొలుకు తీయని భాష మన తెలుగు భాష. అన్ని భాషలను తనలో ఇమడ్చుకోగల సరళమైన ఏకైక భాష మన తెలుగు భాష. అందుకే తెలుగు మాట్లాడే వారందరూ స్నేహితులుగా మారదాం.