Wednesday, April 22, 2015

నిశ్శబ్ధ రాగంలో ..

ఓకవిత రాయాలని వుంది
నీ ఒడిలో తలపెట్టి
మెరిసే ఆ కన్నులు పూయించే
వెన్నెలను ఆస్వాదిస్తూ..
పెదాలపై విరిసిన అరనవ్వును మీటుతూ..
కెంపులయిన చెంపలపై
గారాలు పోతూ గాలికెగురుతున్న ముంగురులను చూస్తూ...

ఓ కవిత రాయాలనుంది
నిశ్శబ్ధ రాగంలో ..
మనసు కోయిల పాడే పాటను
నీ మృదు మధుర పదాలలో వినాలనీ..
గుండె గొంతుక దాటి రాని
మాటలన్నీ నీ మౌనంలోనే వింటూ..
ఈ గుప్పెడు గుండెకు ప్రాణం పోసే ఆగుండె సవ్వడి వింటూ ..

ఓ కవిత రాయాలని వుంది

No comments: